Home » Sankranthi festival
CM Chandrababu Naidu: ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధిగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని అన్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. రద్దీ నియంత్రించటానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు.
Sankranti Festival: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం టీఎస్సార్టీసీ ప్రత్యేకంగా 6432 బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్పీనగర్, ఆరంఘార్ బస్స్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని జిల్లాలకు 1600 వందల బస్సులు, ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళిక చేశారు.
Sankranti holidays: సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు పండుగ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
కొందరి సరదా మరికొందరికి గాయాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పంతగులకు వాడుతున్న చైనా మాంజా. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా(China manja)ను అధికారులు నిషేధించారు.
సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా పండుగ హడావుడి మామూలుగా లేదు. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్.
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
పతంగుల పండుగకు వేళయింది. సంక్రాంతి పండుగ(Sankranti festival) నేపథ్యంలో నగరంలో ఈనెల 13 నుంచి మూడురోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్ శాఖ.. ఇటు ఎన్హెచ్ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
సంబురాల సంక్రాంతి కోసం పట్నం జనాలు కదిలారు పల్లెల వైపు! పుట్టి పెరిగిన ఊళ్లో తల్లిదండ్రులు, బంధువుల మధ్య జరుపుకొంటేనే అసలైన పండగ.. సిసలైన పండగ అంటూ పిల్లాజెల్లాతో కలిసి ఉత్సాహంగా బయలుదేరారు! ఫలితంగా దారులన్నీ హైదరాబాద్ శివార్లవైపు సాగుతున్నాయి.
సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల నిర్వహణకు హైటెక్ హంగులతో బరులు సిద్ధమవుతు న్నాయి. బాపులపాడు మండలం అంపాపురంలో 12 ఎకరాల వెం చర్లో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎల్ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పందేల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్ప టికే పందెం రాయుళ్లు హను మాన్జంక్షన్లో హోటల్ రూమ్ లను బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.