• Home » Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

AP Elections: సజ్జలకు బిగ్ షాక్.. రాజీనామా చేస్తారా..?

AP Elections: సజ్జలకు బిగ్ షాక్.. రాజీనామా చేస్తారా..?

ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం తాళం వేసింది. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేవాళ్లు కావడంతో.. వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమందికి బిగ్ షాక్ తగిలినట్లైంది.

 AP Election 2024: జగన్‌కు భయపడి విదేశాలకు విజయలక్ష్మి.. చింతమనేని సంచలన ఆరోపణలు

AP Election 2024: జగన్‌కు భయపడి విదేశాలకు విజయలక్ష్మి.. చింతమనేని సంచలన ఆరోపణలు

సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్‌తో జగన్‌పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.

Kanakamedala Ravindra Kumar: రాయి ఘటనకు వ్యూహకర్త ఆయనే..

Kanakamedala Ravindra Kumar: రాయి ఘటనకు వ్యూహకర్త ఆయనే..

రెండు రోజుల నుంచి ఏపీలో రాజకీయ క్రీడలు జరుగుతున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాుడూత.. ఏపీ సీఎం జగన్‌పై దాడి ఒక డ్రామా అని అన్నారు. ఏపీలో ప్రజలను పక్కదారి పట్టించే విధంగా సాక్షి రాతలు ఉన్నాయన్నారు. రాయి ఘటనకు వ్యూహకర్త సజ్జల అని పేర్కొన్నారు. మాటువేసి మట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని సాక్షిలో రాసుకున్నారన్నారు.

AP Election: రాయి ఫోర్స్‌గా వచ్చింది.. పథకం ప్రకారమే దాడి, ఈసీకి వైసీపీ నేతల కంప్లైంట్

AP Election: రాయి ఫోర్స్‌గా వచ్చింది.. పథకం ప్రకారమే దాడి, ఈసీకి వైసీపీ నేతల కంప్లైంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ప్రకంపనలు రేపుతోంది. రాయి దాడిని నేతలందరూ ఖండించారు. దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Devineni Uma: ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు

Devineni Uma: ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

Sajjala Ramakrishnareddy: వలంటీర్ల చుట్టూ తిరుగుతున్న సజ్జల ..

Sajjala Ramakrishnareddy: వలంటీర్ల చుట్టూ తిరుగుతున్న సజ్జల ..

వైసీపీ నేతల రాజకీయమంతా వలంటీర్ల చుట్టే తిరుగుతోంది. ఇటీవల వలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుందని.. వారి విషయంలో తమ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్టు అయ్యింది.

AP Elections  2024: సజ్జలపై ఏం చేద్దాం!

AP Elections 2024: సజ్జలపై ఏం చేద్దాం!

Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గీత దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనాకు పాలుపోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని..

Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్‌ తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP News:ఎన్నికల సంఘానికి  అచ్చెన్న లేఖ.. కారణమిదే..?

AP News:ఎన్నికల సంఘానికి అచ్చెన్న లేఖ.. కారణమిదే..?

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని చెప్పారు.

 AP Politics: ‘మేము సిద్ధం’ సభలపై.. సజ్జల కీలక వ్యాఖ్యలు

AP Politics: ‘మేము సిద్ధం’ సభలపై.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఇడుపుల పాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) బస్ యాత్ర ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. ఈ నెల 27వ తేదీన ఇడుపుల పాయ నుంచి జగన్ బస్ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడమే జగన్ లక్ష్యమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి