Home » Sabitha Indra Reddy
తెలంగాణలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి ఈనెల 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. .
సోమవారం ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు.
తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది.
తెలంగాణలో ఇప్పట్లో వర్షాలు (TS Rains) తగ్గేలా కనిపించట్లేదు. ఆదివారం ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. సోమవారం నుంచి మరో ఐదురోజుల పాటు ఇవే వర్షాలు కంటిన్యూ కానున్నాయి. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని పేర్కొంది..
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు లేరు. ఒక్కో టీచర్ ఐదారు సబ్జెక్టులు బోధిస్తున్నారు. భాషా పండితులు, పీఈటీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా సబ్జెక్ట్లకు టీచర్లు లేక ఏటా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తికాకపోవడంతో అత్తెసరు ఫలితాలే వస్తున్నాయి.
గ్రేటర్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టారు. ‘‘భారీ వర్షాల కారణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించారు.
రాష్ట్రంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల్లో పని చేస్తున్న వారిని రెన్యువల్ చేయకుండా, కొత్తగా నియామకాలు జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక షెడ్యూల్ను ప్రకటించారు.
విద్యా యజ్ఞం, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మన నేతలు చెప్పే మాటలు నీటిమూటలేనని తేలింది. దేశంలోని చాలా ప్రాంతాలతో పోలిస్తే పాఠశాలల పనితీరులో తెలంగాణ చాలా వెనుకంజలో ఉంది. పాఠశాలల పని తీరు అంశంలో దేశంలోనే 31వ స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే గ్రేడ్లలో కింది నుంచి రెండోదైన ‘ఆకాంక్షి2’కి పరిమితమైంది.