Home » Rohit Sharma
వైజాగ్ 3వ వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగుల భారీ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో హిట్మ్యాన్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులకు రోహిత్ శర్మ కేవలం 41 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాత ఈ అరుదైన క్లబ్లో స్థానం దక్కించుకునే నాలుగో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. హిట్మ్యాన్ రాయ్పూర్ వన్డేలో ఈ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్ ప్లేయర్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ లాగేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే..
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. మరో మూడు సిక్సులు కొడితే అత్యధిక సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. సఫారీలతో తొలి వన్డేలో ఈ ఫీట్ అందుకునే అవకాశం ఉంది.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ షూట్లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.