Home » RCB
ప్లే ఆఫ్స్ సమరం సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత ఏడు మ్యాచ్లకు దూరమైన ఆర్సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. ప్లే ఆఫ్స్కు ముందే జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్కు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్గా 5,500 పరుగులకు పైగా చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా విరాట్ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.