Home » Raptadu
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చీనీ తోటతో పాటు వ్యవ సాయ పరికరాలు కాలి పోయిన ఘటన శనివా రం రాత్రి శివపురంలో చోటుచేసుకుంది. దీంతో రైతుకు రూ. 8 లక్షలు నష్టం వాటిల్లింది. స్థాని కులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెం దిన మురళి నాలుగు ఎకరాల్లో చీనీ తోట సాగుచేస్తున్నాడు.
వ్యవసాయం తరువాత పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం ఇక్కడి రైతుల జీవానాధారం. పశుగ్రాసం కొరతతో ధరలు ఆకాశాన్నంటుతుంటంతో మూగజీవాల పెంపకం రైతులకు భారంగ మారింది. అరకొరగా గ్రాసం తింటూ మూగజీవాలు అలమటిస్తున్నాయి. రాష్రంలోనే కనగానపల్లి మండలం గొర్రెలు, మేకలు పెంపకంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ విశాలమైన మైదానాలు, కొండలు, గుట్టలు ఉండ టంతో ఎక్కువ మంది ప్రజలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు.
మండలంలోని వరిమడుగు నుంచి పాలచెర్లకు వెళ్లే దారిలో పండమేరు వంకపై నిర్మించిన రెండు చెక్డ్యాంలు శిథిలమయ్యాయి. దీంతో ఆ దారి గుండా రైతులు ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతు న్నారు. వరిమ డుగు నుంచి పాలచెర్లకు వెళ్లే దారిలో పండమేరు వంకపై నీటి ప్రవాహం కోసం, వాహనాలు వెళ్లేందుకు వీలుగా కొన్నేళ్ల కిందట చెక్డ్యాంలు నిర్మిం చారు.
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంటకు వెళ్లే తారురోడ్డుకు మరమ్మతు లు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించ డంతో తారురోడ్డుకు అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి.
నగరంలో చెత్త కుప్పలకు తరచూ నిప్పు ఎందుకు పెడుతున్నారని నగర కమిషనర్ బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలకు నిప్పుండటం గమనించి, కార్మికులను మందలించారు.
మండలంలోని ఎర్రంపల్లి వద్ద సోమవారం దుర్వాసన వెదజల్లుతూ రైల్వేట్రాక్ పక్కన, వంతెన కింద పడి ఉన్న మూటలు కలకలం రేపాయి. రైల్వే, స్థానిక పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఎర్రంపల్లి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన మూడుచోట్ల వేర్వేరుగా ప్లాస్టిక్ సంచి మూటలు పడి ఉన్నాయి.ఒక్కో మూట మధ్య అర కిలోమీటరు మేర దూరం ఉంది.
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రెవె న్యూ సమస్యలను జఠిలం చేసుకోకుండా రాజీ మార్గంలో వెళితే ఇరువర్గాల కు నష్టం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మండల కేంద్ర మైన రామగిరిలో పంచాయతీ రాజ్ శాఖ గెస్ట్హౌస్లో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలంలోని బోగినేపల్లిలో నిధులు లేక ఆగిపోయిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని కోరారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, బోగినేపల్లి గ్రామస్థులు బుధవారం విజయవాడలో దేవాదాయశాఖ మంత్రిని కలిశారు. భోగినేపల్లిలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1. 60 కోట్లతో అంచనా వేశారన్నారు.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా సమాజంలో ఎదురయ్యే సవాళ్లను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు పోవాలని ఎస్పీ వి.రత్న పిలుపు నిచ్చారు. టింబక్టుకలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లిలో మంగళవారం అంతర్జాతీయ మహి ళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.
బీసీ సంక్షేమ వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆమె మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు అధ్వానస్థితికి చేరాయన్నారు.