• Home » Ramoji Film City

Ramoji Film City

Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.

Chandrababu: రామోజీరావు యుగపురుషుడు!

Chandrababu: రామోజీరావు యుగపురుషుడు!

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) మరణించారని తెలుసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు.. హైదరాబాద్‌కు వచ్చి రామోజీరావు పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.!

Ramoji Rao: తెలుగు మీడియాకు ఎనలేని సేవలు

Ramoji Rao: తెలుగు మీడియాకు ఎనలేని సేవలు

మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగు మీడియా రంగానికి రామోజీ రావు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు.

Ramoji Rao: రామోజీ రావు మృతి పట్ల కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ సంతాపం..

Ramoji Rao: రామోజీ రావు మృతి పట్ల కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ సంతాపం..

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం తెలిపారు.

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌,  మల్లికార్జున ఖర్గే

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌, మల్లికార్జున ఖర్గే

రామోజీరావు(Ramoji Rao) మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు మృతి ఆవేదన కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అడుగు పెట్టిన ప్రతీ రంగంలోనూ ఆయన తన మార్క్‌ను చూపించారన్నారు.

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు

రామోజీ రావు(Ramoji Rao) మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు 'రూపర్ట్ మర్డోక్'గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు(87) వ్యాపారవేత్తగా, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ramoji Rao: అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

Ramoji Rao: అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చెబుతున్నారు. రామోజీ రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తుచేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.

Ramoji Rao: భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన రామోజీ రావు

Ramoji Rao: భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన రామోజీ రావు

: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు.

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి

చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం. 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్న మహోన్నత వ్యక్తి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి