Home » Rajya Sabha
మరికొన్ని రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్(Swati Maliwal)ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయగా..అక్కడి సిబ్బంది బావోద్వేగానికి లోనయ్యారు.
YS Sharmila AP Political Entry Issue : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. న్యూఢిల్లీ వేదిగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు తేల్చేశారు. ఇక అధికారి క ప్రకటన మాత్రమే మిగిలుంది..
పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.
రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ నేతగా (ఫ్లోర్ లీడర్) ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమిస్తున్నట్టు ఆప్ నాయకత్వం రాజ్యసభ చైర్మన్కు ఒక లేఖలో తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం సంజయ్ కింగ్ జైలులో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై పడిన సస్పెన్షన్ వేటును రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖఢ్ సోమవారంనాడు రద్దు చేశారు. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
బీజేపీ నేతల మాటల గారడీ గురించి అందరికీ తెలిసిందే. ఏదో అడిగితే, ఇంకేదో సమాధానం చెప్తారు. అడిగిన దానికేదీ సూటిగా జవాబు ఇవ్వరు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, వీళ్లిచ్చే సమాధానాలకు..
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై బుధవారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ఆమె తెలిపారు.
నూతన పార్లమెంట్లో అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందు లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా పాత భవనం లోపలి ప్రాంగణంలో సమావేశమయ్యారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ఉత్తరప్రదేశ్ జీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దనేష్ శర్మ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 15న రాజ్యసభకు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, శర్మ ఒక్కరే నామినేషన్ వేశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థిగా దినేశ్ శర్మ పేరును భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 59 ఏళ్ల దినేశ్ శర్మ 2017 మార్చి నుంచి 2022 వరకూ ఉత్తప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.