Home » Rajya Sabha
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్ట ఖరారు చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (బుధవారం) రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే రేపు జైపూర్ వెళ్లనున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్ ను సమాజ్వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ అదివారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి శ్రీమతి (డాక్టర్) ధర్మశీల గుప్తా, డాక్టర్ భీమ్ సింగ్, ఛత్తీస్గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా నుంచి శ్రీ సుభాష్ బారాల, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాసా బాండగే పోటీ చేయనున్నారు.
పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ కు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారంనాడు ప్రకటించింది. జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నేత సుస్మితా దేవ్, నదిముల్ హఖ్, మమతా బాలా ఠాకూర్ పేర్లను ఖరారు చేసింది.
Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ (YSR Congress) కుయుక్తులు పన్నుతుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రావాల్సిందేనని టీడీపీ-జనసేన (TDP-Janasena) మిత్రపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి..
ఫైర్బ్రాండ్గా పేరున్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనూ ఓరకంగా సంచలనమే సృష్టించారు. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్పై విసుర్లు విసిరారు. అయితే తన వీడ్కోలు ప్రసంగంలో సభ్యులందరికీ క్షమాపణలు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.