Home » Rajnath Singh
పాకిస్థాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మే 7న జరిపిన మిలటరీ దాడులపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిపుణులైన సర్జన్లులా మన బలగాలు సత్తా చాటుకున్నాయని చెప్పారు. ''నిపుణులైన డాక్టర్లు, సర్జన్లు ఎలా వ్యవహరిస్తారో మన బలగాలు కూడా అలాగే పనిచేశాయి. ఉగ్రవాద మూలాలలై ప్రతిభావంతంగా దాడులు జరిపాయి'
భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.
Operation Sindoor: పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్పై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని అన్నారు.
పాకిస్థాన్ వంటి బాధ్యతారహితమైన, ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సురక్షితం కాదని, వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పరిధిలోకి తెచ్చి, పర్యవేక్షించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
బాధ్యత లేని.. మూర్ఖమైన పాకిస్థాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.
మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్బేస్పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ విజయంపై బీజేపీ తిరంగయాత్ర నిర్వహించనుంది. 13 నుంచి 23 మే వరకు 11 రోజుల పాటు ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది.
ప్రధానమత్రి నరేంద్ర మోదీ 2018లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా లక్నో యూనిట్ను ప్రకటించారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం మిలట్రీ చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు.
పాక్, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది.ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి తెలిపారు.