Home » Raghav Chadha
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన ఎంపీలపై పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు అపాయింట్మెంట్ కోరారు.
చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్లో పాల్గొన్నారు. పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు.
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .
రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ నేతగా (ఫ్లోర్ లీడర్) ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమిస్తున్నట్టు ఆప్ నాయకత్వం రాజ్యసభ చైర్మన్కు ఒక లేఖలో తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం సంజయ్ కింగ్ జైలులో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై పడిన సస్పెన్షన్ వేటును రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖఢ్ సోమవారంనాడు రద్దు చేశారు. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నెర్ర చేసింది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సీపీం పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఈసీ దృష్టికి తెచ్చింది.
రాజ్యసభ నుంచి సస్పెన్షన్కు గురైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఆయన తన సస్పెన్షన్పై నేరుగా రాజ్యసభ చైర్పర్సన్ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా బీజేపీపై సంచలన అరోపణలు చేశారు. 2024 ఎన్నికలకు ముందే 'ఇండియా' కూటమి నేతల అరెస్టును బీజేపీ టార్గెట్గా పెట్టుకుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో దీనిని మొదలుపెట్టనుందని అన్నారు.
ప్రభుత్వ బంగ్లా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై రాఘవ్ చద్దా ఒక ట్వీట్లో తన స్పందన తెలిపారు. ఈ పోరాటం ఒక ఇంటి కోసమో, దుకాణం కోసమే కాదని, రాజ్యాంగాన్ని రక్షించేందుకని ట్వీట్ చేశారు.