• Home » Purandeswari

Purandeswari

Kolusu Parthasaradhi: ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉంది

Kolusu Parthasaradhi: ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉంది

కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు తనకు మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందని పార్థసారధి ప్రశంసించారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకి ఉందన్నారు.

Chandrababu: అరుదైన ఘటన..1995లో వెంకటేశ్వరరావు, 2024లో పురంధేశ్వరి!

Chandrababu: అరుదైన ఘటన..1995లో వెంకటేశ్వరరావు, 2024లో పురంధేశ్వరి!

కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29 ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బలపరిచారు.

Chandrababu: శాసనసభ పక్షనేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

Chandrababu: శాసనసభ పక్షనేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Purandeshwari: బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

Purandeshwari: బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యారు. శాసన సభ పక్ష నేత ఎంపిక‌పై చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.

Election Results: గోదావరి జిల్లాల సెంటిమెంట్ వర్కౌట్..

Election Results: గోదావరి జిల్లాల సెంటిమెంట్ వర్కౌట్..

ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

AP Election Results: భారీ అధిక్యంలో టీడీపీ కూటమి అభ్యర్థులు.. రాజమండ్రి పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..

AP Election Results: భారీ అధిక్యంలో టీడీపీ కూటమి అభ్యర్థులు.. రాజమండ్రి పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..

ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

AP News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి.. కారణమిదే..?

AP News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి.. కారణమిదే..?

ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు.

NTR Janathi: ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

NTR Janathi: ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

Daggubati Purandeswari: కార్యకర్తల సమిష్టి కృషితో ఎన్‌డీఏ కూటమి విజయం ఖాయం

Daggubati Purandeswari: కార్యకర్తల సమిష్టి కృషితో ఎన్‌డీఏ కూటమి విజయం ఖాయం

కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) స్పష్టం చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారిత పార్టీ అని పురంధేశ్వరి ఈ సందర్భంగా అన్నారు.

AP Election 2024:ఐదేళ్లలో పరిశ్రమలను  వైసీపీ దెబ్బతీసింది:పురంధేశ్వరి

AP Election 2024:ఐదేళ్లలో పరిశ్రమలను వైసీపీ దెబ్బతీసింది:పురంధేశ్వరి

ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి