Home » Priyanka Gandhi
Telangana: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు షెడ్యూల్ను రూపొందించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సోదరుడు రాహుల్ గాంధీని యువరాజుగా సంబోధిస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రాహుల్ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ప్రధాని మోదీ తన రాజభవనంలో కూర్చుని రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదన్నారు.
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.
ఉత్తరప్రదేశ్ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు.
రాయ్బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్లో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నేడు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఈ రెండు స్థానాలు ఉన్నాయి.
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో సైతం కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.
మేథీ, రాయబరేలి లోక్సభ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులపై కొన్ని గంటల్లో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ జై రాం రమేశ్ బుధవారం వెల్లడించారు. ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారన్నారు. 24 గంటల్లో లేదా 30 గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
యూపీలోని రాయబరేలి లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డనుంది. ప్రియాంక గాంధీ వాద్రాను రాయబరేలి నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దింపేందుకు ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్ మేనేజిమెంట్ కోసం 'స్పెషల్ 24' టీమ్ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఏర్పాటు చేశారు.