• Home » Priyanka Gandhi

Priyanka Gandhi

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.

LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక

LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక

మేథీ, రాయబరేలి లోక్‌సభ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులపై కొన్ని గంటల్లో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ జై రాం రమేశ్ బుధవారం వెల్లడించారు. ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారన్నారు. 24 గంటల్లో లేదా 30 గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

Lok Sabha Elections 2024: అమేథి నుంచి నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ

Lok Sabha Elections 2024: అమేథి నుంచి నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Lok Sabha Polls: ప్రియాంక అరంగేట్రం కోసం 'స్పెషల్ 24' టీమ్‌

Lok Sabha Polls: ప్రియాంక అరంగేట్రం కోసం 'స్పెషల్ 24' టీమ్‌

యూపీలోని రాయబరేలి లోక్‌సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డనుంది. ప్రియాంక గాంధీ వాద్రాను రాయబరేలి నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దింపేందుకు ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్ మేనేజిమెంట్ కోసం 'స్పెషల్ 24' టీమ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఏర్పాటు చేశారు.

Lok Sabha Elections: బహిరంగంగా పచ్చి అబద్ధాల చెప్పే ప్రధానిని మొదటి సారి చూశా: ప్రియాంక ఫైర్

Lok Sabha Elections: బహిరంగంగా పచ్చి అబద్ధాల చెప్పే ప్రధానిని మొదటి సారి చూశా: ప్రియాంక ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.

Lok Sabha Elections 2024: అమేథీ, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థులపై వీడనున్న సస్పెన్స్

Lok Sabha Elections 2024: అమేథీ, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థులపై వీడనున్న సస్పెన్స్

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.

Uttar Pradesh: రాయ్‌ బరేలీలో పోటీకి వరుణ్‌ గాంధీ ‘నో’!

Uttar Pradesh: రాయ్‌ బరేలీలో పోటీకి వరుణ్‌ గాంధీ ‘నో’!

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీకి ఆ పార్టీ నాయకత్వం రాయ్‌ బరేలీ టికెట్‌ ఆఫర్‌ చేయగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం.

Delhi: అమేఠీలో రాహుల్‌ రాయ్‌ బరేలీలో ప్రియాంక!

Delhi: అమేఠీలో రాహుల్‌ రాయ్‌ బరేలీలో ప్రియాంక!

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.

Priyanka Gandhi: ఫలితాలు అనూకూలంగా రావనే నిస్పృహల్లో బీజేపీ

Priyanka Gandhi: ఫలితాలు అనూకూలంగా రావనే నిస్పృహల్లో బీజేపీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు.

Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు

Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి