Home » Prime Minister
వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలను ఆహ్వానించారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార వేదిక వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఏజెన్సీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ వారాంతంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.
కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక.. సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశంవైపు ఆశగా చూస్తోందని.. యువతే మన దేశానికి గొప్పబలమని ఆయన పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్సభ, ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై 'ఇండియా' కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇదేమీ వ్యక్తుల మధ్య 'బ్యూటీ కాంటెస్ట్' కాదన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న భారతీయులు ఇప్పుడు ఐర్లాండ్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం డీప్ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్సైట్లో అప్లోడ్ చేశారు.
కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.