Home » Praneeth Rao
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీగ లాగే కొద్ది డొంక కదులుతోంది. ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ట్యాపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైందని, నిర్లక్ష్యం వహించొద్దని కోరారు.
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితును కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నిందితులు తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. రేపటి (బుధవారం) లోగా పిటిషన్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో కేసును రేపటికి వాయిదా వేసింది.
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో రోజుకో కీలక విషయం బయటికొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే...
హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ట్యాప్ చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. ప్రణీత రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం ఉదయం గాంధీ అస్పత్రికి తరలించారు.
తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని (SP Bhujanga Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో అదనపు ఎస్పీగా పని చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతి రావు (Tirupati Rao) ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
Hyderabad News: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు వ్యవహారంలో మాజీ పోలీసు అధికారుల(Ex Police Officials) ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో(Prabhkar Rao) పాటు పలువురు ఇళ్లలో సోదాలు..
Telangana: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కస్టడీలో భాగంగా ఐదవ రోజు ప్రణీత్ను పోలీసులు విచారించగా... పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీకి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నలో ప్రణీత్ రావు నడిచినట్లు విచారణలో తేలింది. 50 మంది అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న ప్రణీతరావు.. మూడు షిఫ్టుల్లోనూ అధికారులను ఉపయోగించి టాపింగ్కు పాల్పడ్డాడు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగింది. నిన్న ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.