Home » Ponnam Prabhakar
Ponnam Prabhakar Farmers: రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు.
కాలుష్య నివారణకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో విద్యుత్ వాహన పాలసీని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్కును మంత్రి ప్రారంభించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు తీసుకురావడానికి ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులపై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుల్లో మూడు సవరణలు చేయాలని బీఆర్ఎస్ ప్రతిపాదించగా, ఆయా అంశాలను కేంద్రానికి పంపే బిల్లుల్లో పెట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది.
Telangana Assembly: మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్పై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జర్నలిస్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు.
శాసన సభాపతిని అవమానించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారే.. మళ్లీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
‘మేం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయ్యాయి. మాపై బీఆర్ఎస్, బీజేపీ కలిసి విమర్శలు గుప్పిస్తున్నాయి.. హామీలపై నిలదీస్తున్నాయి..
రెండున్నరేళ్లలో వర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని, నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఇన్స్పైర్ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన 50 మంది బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అభినందించారు.