Home » Ponnala Lakshmaiah
తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.
‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింపజేయడానికి పురాణపండకు కబురు పెట్టినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో వినబడుతోంది.
Telangana: బీఆర్ఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ చచ్చిన పాము అంటున్నారని.. కేవలం 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవన్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రకు...
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.
‘శత్రు భయంకరం’.. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు.
Telangana: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందంటూ మంత్రి అన్నారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని అంటున్నారని మండిపడ్డారు.
సీఆర్ ( KCR ) పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaia ) చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party )లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaiah ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) నుంచి ఇతర పార్టీల్లో చేరిన కీలక నేతలపై ఏఐసీసీ ( AICC ) దృష్టి సారించింది. వారిని ఏలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) రంగంలోకి దిగారు.