Home » Pongal
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే గిప్ట్ ఈనెల 8వ తేదీ నుంచి అందించనున్నారు. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేషన్కార్డు దారులకు పొంగల్ కానుకగా రూ. 5వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా రాష్ట్రంలో ఉత్సాహకరంగా, ఉల్లాసభరితమైన పోటీలు నిర్వహించడం ప్రతి ఏడాది చూస్తుంటాం. అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి.
యేటా రేషన్షాపుల్లో ప్రభుత్వం ఇచ్చే పొంగల్(Pongal) కిరాణా సరకులతోపాటు నగదును పంపిణీ చేయాలా? వద్దా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మద్రాసు హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది.
పొంగల్(Pongal) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06569 బెంగళూరు-తూత్తుకుడి ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది.
పొంగల్ పండుగను అడ్డుపెట్టుకుని ప్రైవేటు బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నై - తిరునెల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ఏకంగా రూ.4 వేలు చార్జీ వసూలు చేయడం గమనార్హం.
కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న గృహిణులందరికీ మార్చిలోగా రూ.1000 చెల్లించనున్నట్లు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సభ్యుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.
పొంగల్(Pongal) బహుమతులు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ల పంపిణీ ప్రారంభమైంది. రేషన్ ఉద్యోగులు శుక్రవారం నుంచి ఇంటింటికీ వెళ్లి టోకెన్లు ఇస్తున్నారు. ఈ ఏడాది పొంగల్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కిట్ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ప్రకటించిన సంగతి తెలిసిందే.
పొంగల్ సందర్భంగా నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీకి ప్రత్యేక కొండ రైలు(Special hill train) సేవలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
‘పొంగల్ గిఫ్ట్’(Pongal gift) ప్యాక్ టోకెన్లపంపిణీ ఈనెల 3వ తేది నుంచి ఇంటింటికీ వెళ్లి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా బియ్యం కార్డుదారులు, శ్రీలంకతమిళుల పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి తలా కిలో పచ్చి బియ్యం, కిలో చక్కెర, చెరుగు గడ అందించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయంతెలిసిందే.