Home » Police case
బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. ఈ యాప్ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేసి.. నోటీసులు ఇస్తున్నారు.
వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి అనే మహిళు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నాగరాణిని దిల్సుక్నగర్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి జరిగింది. 'హ్యాపీ హోలీ' అంటూ దుండగుడు అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో అకౌంటెంట్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావుపై అవినీతి ఆరోపణలు నిర్ణారణ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అతనిని వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ అక్రమాలపై గతంలో ఆధారాలతో సహా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు.
ఫామ్హౌస్లో కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలంటూ మాదాపూర్లో ఉంటున్న ఆయన ఇంటికి పోలీసులు ఈ మేరకు నోటిసులు అంటించారు.
దోపిడీ కోసం వచ్చిన దొంగలు తెలివిగా తమిళనాడుకు సంబంధించిన ఓమిని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకొని వచ్చారు. ఆ ఓమిని వాహనానికి తమిళనాడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉంది. మొత్తం ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో దొంగ తప్పించుకోవడంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయిన చంద్రశేఖర్ రెడ్డి.. తరువాత ప్రైవేట్ కాలేజీలో లేచ్చరర్గా ఉద్యోగం చేశారు. ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వంశీని మరోసారి విచేరించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటు పోలీసులు వేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.