Home » Polavaram
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు రోజూ ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోంది.
పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని తెలిపారు.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు పర్యాటక అభివృద్ధిపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సహా పరిసర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన కీలకంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు.
గోదావరి జలాలు తొలిసారిగా కృష్ణానది పవిత్ర సంగమాన్ని చేరనున్నాయి. పోలవరం–పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా నీటి అనుసంధానం సాకారమవుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా రాష్ట్ర జలవనరుల నిర్వహణలోనూ ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
పోలవరం టూరిజం హబ్కు సంబంధించిన అధికారులతో పాటు జపాన్ నిప్పాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం టూరిజం హబ్ డిజైన్లపై ఆయన కీలక చర్చ చేశారు.