• Home » Pithapuram

Pithapuram

AP Elections2024 :వైసీపీకి ఓటమి తప్పదు... అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు: నాగబాబు

AP Elections2024 :వైసీపీకి ఓటమి తప్పదు... అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు: నాగబాబు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..

AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..

Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.

AP Elections: జగన్ సభల కోసం..  పిఠాపురంలో విధ్వంసం

AP Elections: జగన్ సభల కోసం.. పిఠాపురంలో విధ్వంసం

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో...

AP Elections: ముద్రగడ  మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!

AP Elections: ముద్రగడ మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!

వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..

AP Elections: సీన్‌లోకి చిరంజీవి.. వార్ వన్‌సైడేనా..!

AP Elections: సీన్‌లోకి చిరంజీవి.. వార్ వన్‌సైడేనా..!

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.

AP Elections: పవన్‌ నెత్తిన పాలుపోస్తున్న ముద్రగడ ..!

AP Elections: పవన్‌ నెత్తిన పాలుపోస్తున్న ముద్రగడ ..!

ఏపీలో ఎన్నికల వేళ అందరిదృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీచేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఏకైక లక్ష్యంతో వైసీపీ ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కాపు ఉద్యమనాయకుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుని.. పిఠాపురంలో పవన్‌ను ఓడించే బాధ్యతలు అప్పగించారు.

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.

Pawan Kalyan: రాసిపెట్టుకోండి.. పిఠాపురంలో గెలుస్తున్నా.. అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నా!

Pawan Kalyan: రాసిపెట్టుకోండి.. పిఠాపురంలో గెలుస్తున్నా.. అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నా!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేతలు పరుగులు తీస్తున్నారు. ఒకే రోజు మూడు, నాలుగు బహిరంగ సభల్లో పార్టీల అధిపతులు, అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు...

AP Elections: ముద్రగడ విషయంలో ఇలా అయ్యిందేంటి.. వైసీపీలో అంతర్మథనం!!

AP Elections: ముద్రగడ విషయంలో ఇలా అయ్యిందేంటి.. వైసీపీలో అంతర్మథనం!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ..

AP Politics: బయటపడుతున్న జగన్ కుట్రలు.. ఛీ కొడుతున్న జనం..

AP Politics: బయటపడుతున్న జగన్ కుట్రలు.. ఛీ కొడుతున్న జనం..

ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్‌ ఐదేళ్ల పాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో.. ప్రజల మూడ్‌ను మార్చేందుకు జగన్ అండ్ కో అనేక కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్‌ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు జగన్ గెలవడంతో పాటు.. మరోవైపు విపక్షంలో కీలక నేతలను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి