Home » Palnadu
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు విగ్రహం తొలగింపుపై ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోడెల శివ ప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. అలాంటి వేళ.. పల్నాడ్ ఇన్చార్జ్ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై అతడి స్నేహితులు దాడి చేశారు. దీంతో అతడు గుంటూరులోని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.
Andhrapradesh: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపు బాధాకరమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు.
పల్నాడు అభివృద్ధి కోసం కోడెల శివప్రసాద్ కృషి చేశారని ఆయన కుమారుడు శివరాం గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. అధికారులు అత్యుత్సాహంతో కోడెల విగ్రహాం తొలగించారని మండిపడ్డారు.
పల్నాటి గడ్డపై మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు అడ్డుకోవడం తీవ్ర బాధాకరమని ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు.
వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికే 4 నెలలు పట్టిందని, వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో అతిసారం ప్రబలింది. కాలనీలో రెండు రోజులుగా 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
పల్నాడు జిల్లా క్రోసూరులో బురఖా ధరించిన యువకుడు స్థానిక ఆస్పత్రి వద్ద హల్చల్ చేశాడు. మహిళ వేషధారణలో వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో టీడీపీ నేతలపై దాడి ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో అరాచకం సృష్టించారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పంటించారు.