Home » Organ Donation
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు అవయవదానంలో ఆరుగురు పునర్జన్మ పొందారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా కడలాడి ప్రాంతానికి చెందిన సంజయ్ (22) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేసేందుకు మదురైలోని షోరూమ్కు వెళ్లాడు.
నంద్యాల దేవనగర్కు చెందిన ఆదిలక్ష్మమ్మ అనే మహిళ సోమవారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నంద్యాలలోని ప్రభుత్వాసుపత్రికి ఆసుపత్రి వచ్చారు.
Telangana: కోకాపేటలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ను ఓ ఆటో ఢీకొట్టి.. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తమ బిడ్డ ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
కొందరు వైద్యులు తమ వృత్తిని దైవంగా భావిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక రోగి ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంత సాహసమైనా చేస్తారు. ఈయన కూడా అంతే..
అత్యవసరంగా అవయవాలు అవసరమైన వ్యక్తులకు మార్పిడి చేయడానికి విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రి ( Ayush Hospital ) వైద్యులు మహత్తర కార్యక్రమానికి సకల్పించారు. ఆస్పత్రిలో ఉన్న గుండె, కిడ్నీ, లివర్ శరీర భాగాలను వివిధ ప్రాంతాలకు వైద్యులు తరలిస్తున్నట్లు ఆయుష్ ఆస్పత్రి వైద్యులు వై. రమేష్ బాబు తెలిపారు.
మనిషికి పంది కిడ్నీ(Pig Kidney) అమర్చిన ప్రయోగం సక్సెస్ కావడంతో వైద్య రంగంలో కొత్త చరిత్ర లిఖితమైంది. పంది కిడ్నీ గతంలోకన్నా ఎక్కువ రోజులు రెండు నెలలపాటు విజయవంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ల ప్రయత్నాలకు ఈ ప్రయోగం కొత్త ఊపిరిలూదింది.
ప్రమాదంలో మరణించినా తన అవయవాలతో మరో నలుగురికి ప్రాణం పోసింది మహిళ. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ శ్రీరామ్నగర్కు చెందిన ప్రదీప్ కుమార్ భార్య, కుమారుడితో కలిసి నాలుగు రోజుల క్రితం షాపింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరారు.