Home » Operation Sindoor
'రుద్ర' యూనిట్లో పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి సేన, ప్రత్యేక దళాలు, మానవరహతి ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమెండో యూనిట్ 'భైరవ్'ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఆపరేషన్ సిందూర్పై లోకసభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు కిరణ్ రిజిజు తెలిపారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో మనం ఉన్నామని, యుద్ధాల గతి మారిపోయిందని సీడీఎస్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయుధాలు, టెక్నాలజీ పరిజ్ఞానం గురించి మిలటరీ పూర్తిగా అప్డేట్ కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు.
కీలకమైన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశాలపై ..
కేంద్ర అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ట్రంప్ ప్రకటనలు, ఆపరేషన్ సిందూర్, చైనా పాత్రతో సహా వివిధ అంశాలపై పార్లమెంట్ లో 2 నుంచి 3 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు. బీహార్లో ఓట్ల రద్దు, పహల్గామ్ ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాలను పార్లమెంట్లో తాము లేవనెత్తుతామని చెప్పుకొచ్చారు.
Operation Sindoor: శుక్రవారం వైట్ హౌస్లో డిన్నర్ పార్టీ జరిగింది. ఈ విందులో రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. విందు సందర్భంగా ట్రంప్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు.
అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. టీఆర్ఎఫ్ని గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా గుర్తించింది. లష్కర్-ఎ-తోయిబా అనుబంధంగా టీఆర్ఎఫ్ గుర్తించింది.
న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన యూఏవీ, కౌంటర్-అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సి-యూఏఎస్) స్వదేశీకరణ వర్క్షాప్లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఇవాల్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.