Home » Ongole
తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
చివరి బస్సు అందకపోవడంతో తెల్లవారేవరకూ బస్టాండ్లోనే విశ్రమించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అవుట్పోస్టు కానిస్టేబుల్ లాఠీతో చితకబాదాడు.
సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కరెక్టు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
Andhrapradesh: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. 100 దేవాలయాల్లో 300 వెండి ఆభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకోవడంపై హోంమంత్రి అనిత అభినందించారు.
సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
జగన్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను ఎందుకు వాడకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల ఫలాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని చెప్పారు. ఉప రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని ఈరోజు కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.