Home » Ongole
జగన్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను ఎందుకు వాడకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల ఫలాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని చెప్పారు. ఉప రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని ఈరోజు కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Andhrapradesh: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో పోర్టు ఆధారిత వాణి జ్య అవకాశాలు పుష్కలంగా ఉన్నందున నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను పూర్తి చేస్తామని దామచర్ల సత్యనారాయణ(సత్య) చెప్పారు.
Andhrapradesh: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలందించారని కొనియాడారు.