Home » Odisha
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒడిశాలో నాలుగు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది.
సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్సభ, ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈసారి ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్డీయే, ఇండియా కూటమి ఎత్తులు పైఎత్తులతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదిపాయి. ఎట్టకేలకు రేపు ఏడో దశ పోలింగ్తో లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు తెరపడనుంది.
బీజేడీ, బీజేపీ మధ్య బంధాన్ని బద్దలుకొట్టి ఒడిసాలోనూ తెలంగాణ తరహా ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిసా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కు చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రలోక్ లోక్సభ నియోజకవర్గంలో రాహుల్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. అకస్మత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కారణం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.