Home » Odisha
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్గిరి-పాండురంగాపురం రైల్వే లైన్తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్లోని మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.
ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో అగ్నివీర్ నాల్గవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటి మూడు బ్యాచ్ల్లో 2,500 మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారని తెలిపారు. 2022లో అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.
రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్ను 2-1తో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే..
మధ్యాహ్నం భోజనం తిని దాదాపు 100 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. ఆ క్రమంలో వాంతులు, ఛాతీ నొప్పితో వారంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాంతో వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి.. వైద్య చికిత్స అందించారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన బిజూ జనతాదళ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత మమత మోహంతా తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖఢ్ ఆమోదించారు.
గనులపై, ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే రాయల్టీ.. పన్ను కాదని తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై ఆయన పెదవి విరిచారు.
పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే పథకాల పేర్లు మారుతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే పురస్కారాలు పేర్లు సైతం మారిపోతాయి. ఒడిశాలో తాజాగా అదే జరిగింది. గత నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు అందజేసేది.