Home » ODI World Cup
Team india: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోయిన తమకు ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారని.. వారి పట్ల ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచకప్లో తమ ప్రదర్శన చాలా సంతృప్తి ఇచ్చిందని. .ఈ జోష్తో వచ్చే ఏడాది జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో గెలిచి తీరుతామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
Team india: ఆస్ట్రేలియా మీడియా సంస్థకు చెందిన సోషల్ మీడియాలో టీమిండియాను అవమానపరుస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. South Australia Man Gives Birth To World Record 11 Sons అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ట్రావిస్ హెడ్ను డెలవరీ రూంలో బెడ్పై పడుకున్న తల్లిగా చూపిస్తూ పిల్లలకు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయడం వివాదానికి దారి తీసింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్తో పాటు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు నంబర్వన్ పొజిషన్లో ఒకరు కూడా లేరు. దీంతో నంబర్వన్ ర్యాంకులు లేకుండా నంబర్వన్గా నిలిచిన ఆస్ట్రేలియాను అందరూ ప్రశంసిస్తున్నారు.
ODI World Cup: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత్లో భారత్ను ఓడించడం సామాన్య విషయం కాదని.. ఆస్ట్రేలియాకు ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్, సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Team India: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు.
ODI World Cup: అయితే ప్రపంచకప్లో సూర్యకుమార్ చెత్తగా ఆడాడంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ విమర్శలు చేశాడు. అసలు ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచిందని.. అతడు ఎలా ఆడాలని భావించాడో తెలియలేదని పేర్కొన్నాడు.
ODI World Cup: ఇండియా వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చరిత్ర సృష్టించింది. 2023 ప్రపంచకప్ను చరిత్రలో తొలిసారిగా 12,50,307 మంది స్టేడియాల్లో వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఒక ఎడిషన్ను ఇంత మంది ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ అనే కాదు. ఏ ఐసీసీ టోర్నీకి కూడా ఇంత మంది ప్రేక్షకులు హాజరు కాలేదు.
Rahul Gandhi: వన్డే ప్రపంచకప్ ముగిసినా టీమిండియా ఓటమి ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు టీమిండియా ఓటమికి కారణాలు విశ్లేషిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమిండియా ఓటమికి గల కారణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఆశించిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రపంచకప్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓడిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆదివారం జట్టు ఓడిన అనంతరం స్వయంగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన ఆయన ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. వారితో ప్రేమగా మాట్లాడిన మోదీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు.