Home » NTR Foundation
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27,28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన స్నాతకోత్సవం జరగనుందని వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.
తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభించారు. మెనెజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు తమన్ ఈ కేర్ సెంటర్ను ఓపెన్ చేశారు.
నెల జీతాన్ని ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల సహాయార్థం అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్కు (NTR Foundation) నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) రూ. 2 కోట్ల చెక్కును సోమవారం విరాళంగా అందజేశారు.