Home » NTR District
నందిగామ పురపాలక సంఘంలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ చట్టంలోని రిక్విజేషన్ పేరుతో సమావేశం ఏర్పాటు వివాదానికి కారణంగా నిలిచింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహిళనని చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రతిసారీ అవమాన పరుస్తున్నారన్నారంటూ కంటతడిపెట్టారు.
అవును.. ఏపీ మంత్రి విడదల రజనీ (Minister Vidadala Rajani) శాఖ మారిపోయిందోచ్..! వైద్య ఆరోగ్యశాఖ (Minister for Health, Family Welfare) కాస్త హోం శాఖగా మారిపోయింది..!
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.
జిల్లాలోని జి. కొండూరు మండలం వెల్లటూరులో బొడ్డు బాలయ్య (30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ వైన్షాప్కు 200 మీటర్ల దూరంలో బాలయ్య మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్మాల్ జరిగింది. సర్పంచ్కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ. 15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది.
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం, అంజనేయపురంలో కొడుకుపై బెంగతో ఓ తల్లి బలవన్మరణం చెందింది. తనయుడు చెంత లేడనే మనోవేదనతో ఎలుకలు మందు తిని ఆత్మహత్య చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడు గ్రావెల్ దందా (Gravel Danda) చేస్తున్నాడు. మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం మండలాలకు భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: పాలిటిక్స్ డైవర్ట్ చేసేందుకు రామోజీరావును టార్గెట్ చేస్తూ.. సిఐడిని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
ఇటీవల కాలంలో గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అనేక చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నారు.
ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వ్యక్తి బండారం బయటపడింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గోపీనాథ్ అనే వ్యక్తి తమ దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ ఓ బాధితుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు.