Home » NTR District
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగదు తరలింపులపై పోలీసులు దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో చెక్ పోస్టులు వద్ద శనివారం అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న కోటి రూపాయల వరకు నగదు పట్టుబడటంతో కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు.
Andhrapradesh: మరో నెలన్నరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీ కూడా వచ్చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. రెండో సారి విజయం తమదే అన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నందిగామలో వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
Andhrapradesh: గంపలగూడెం మం కొణిజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి టీడీపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలో కొలికపూడికి గ్రామస్థులు, టీడీపీ శ్రేణులు హారతులు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజల ఆధ్యర్యంలో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు.
సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా సీఎం జగన్కు లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు.
‘‘వైఎస్సార్ ఆసరా’’ నాల్గోవిడత చెక్కుల పంపిణీలో అధికారులు, వైసీపీ నేతలు మహిళలను నిర్బందించి బలవంతంగా సభ నిర్వహించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండల ఆఫీసులో జరిగింది.
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన గొంతును తానే కోసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఏ.కొండూరు మండలం అట్ల ప్రగడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో బోరుబావికి తలబాదుకొని చాకుతో తన మెడను కోసుకున్నాడు.
Andhrapradesh: మైలవరంలో దొంగల బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు.
శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పనంగా ఆస్తులు కట్టబెడుతోందని బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) ఆరోపించారు.
జిల్లాలోని రెడ్డిగూడెంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. జిల్లా మంత్రి అండదండలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.