Home » Nizamabad
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిడ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్రాలు చేశారు.
Telangana: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Telangana Elections: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల సిబ్బంది తరలుతున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో 833 ప్రాంతాలలో 1549 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.
డిచిపల్లి మండలం బర్దిపూర్ శివారులోని మహేంద్ర కార్ల షో రూమ్లో చోరీ జరిగింది. ఈ చోరీలో 60 వేలు, 6 సెల్ఫోన్లు దొంగలు ఎత్తికెళ్లారు. లాకర్ను ఎత్తుకు వెళ్లే క్రమంలో అధిక బరువు ఉండడంతో షోరూమ్ వెనుక భాగంలోని చెత్త కుప్పలో దాచారు.
Telangana Elections: రాజకీయ మార్పు అనివార్యమైన పరిస్థితిలో మారాలన్న నిర్ణయం ఉండాలని పార్టీ మారడం జరిగిందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు.
Telangana Elections: లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ... రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని.. అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు.
Telangana Elections: ఎన్నికలు అనగానే ఒక బ్రమ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం విద్యార్థులు, కొత్త ఓటర్లలతో ఇంటరాక్షన్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికలను ఆషామాశీగా తీసుకోవద్దన్నారు. యువతలో చైతన్యం రావాలన్నారు. స్వేచ్ఛ యుతంగా ఉండటం అనేది ముఖ్యమన్నారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలని.. ప్రశ్నించటం తెలంగాణ రక్తంలోనే ఉందని చెప్పుకొచ్చారు.
బోధన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్రంగా ఖండించారు.
బోధన్ మండలం పెంటఖుర్దు క్యాంప్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS - Congress ) నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తగా మారింది. గ్రామంలో వేర్వేరుగా ఎన్నికల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు.