Home » Nizamababad
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు చేయడంపై పెద్దఎత్తున ధర్మా చేపట్టారు.
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.
తెలంగాణ: విధులు మరచి వింధులు, వినోదాల్లో మునిగి తేలిన ఓ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు దుమ్మెత్తి పోస్తున్నారు. రోగులను గాలికొదిలేసి జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు మృతి చెందగా.. అదే పట్టణానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిన్న వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధుల బారిన పడిన తన కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంది. నిజామాబాద్ జిల్లా బీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన అనూష కుమారుడు రితిక్ మూడో తరగతి చదువుతున్నాడు.
అవసరాన్ని బట్టి రూ.10 వడ్డీ.. అది కూడా తక్కువ గడువే.. ఆలోగా అసలుతో కలిపి చెల్లించారా సరేసరి..! లేదంటే.. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా వేధింపులు తిప్పలు తప్పవు..!
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.
ఓ కేసులో స్టేషన్ బెయిల్ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఆయన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.