Home » Nizamababad
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రేపు ఉదయానికి తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తైన తర్వాత బీఎస్పీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానపోటీ జరిగినట్లు తెలుస్తోంది.
బీదర్ వయా సికింద్రాబాద్గా నిజాముద్దీన్కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శలు గుప్పించారు. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు చేయడంపై పెద్దఎత్తున ధర్మా చేపట్టారు.
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.
తెలంగాణ: విధులు మరచి వింధులు, వినోదాల్లో మునిగి తేలిన ఓ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు దుమ్మెత్తి పోస్తున్నారు. రోగులను గాలికొదిలేసి జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు మృతి చెందగా.. అదే పట్టణానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.