Home » Nitish Kumar
జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్కుమార్ అధ్యక్షతన జరిగిన కోర్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.
బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు.
జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఇండియా కూటమి ‘ప్రధాని’ పదవి ఆఫర్ చేసిందని ఇటీవల ఆ పార్టీ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం..
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్(272)ని దాటి 293 స్థానాలు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా..
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
లోక్సభ ఎన్నికలు-2024లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ను (272) మించి 293 స్థానాలను కైవసం చేసుకోవడంతో.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే..
ఎన్డీఏ(NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును(PM Modi) రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు మోదీని బలపరిచారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.