Home » Nellore
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ బెయిల్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని.. అనవసరంగా నన్ను కెలకొద్దంటూ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12604)కు నాయుడుపేట్లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
నిందితుడి ప్రకాష్ను అదుపులోకి తీసుకుని తన వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు గంజాయి కేసులు నమోదు అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలు పెంచుకుని ఓ మహిళ.. ఆ ఐదేళ్లలో అత్యంత పవర్ఫుల్గా తయారయ్యారనే వార్తలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసుల అండతో.. తన కనుసైగలతో సెటిల్మెంట్లు, దందాలను నడిపించేదని తెలుస్తోంది.
నగరంలోనే ఫ్లెక్సీలు నిషేధిస్తే.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఫ్లెక్సీలు ఏమిటని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో రాజకీయాలు చేస్తున్నారా.. అని నిలదీశారు.
మరో ఘటన బీమిలీ పట్టణంలో చోటుచేసుకుంది. సరగడ అప్పలరెడ్డి (42) అనే వ్యక్తి బీచ్లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటమునిగారు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు.. ఆయనను పట్టుకుని ఒడ్డుకు చేర్చి.. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నెల్లూరులోని భగత్సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్న 1400 కుటుంబాలకు మంత్రి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.