• Home » NDA Alliance

NDA Alliance

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు..

NDA Key Meeting: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

NDA Key Meeting: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసానికి మోదీ వెళ్లారు.

LokSabha Elections: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం

LokSabha Elections: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. అయితే మహారాష్ట్ర సింగ్లి లోక్‌సభ సభ్యుడు విశాల్ పాటిల్.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

NDA Meeting: ఎన్డీయే ఎంపీల భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

NDA Meeting: ఎన్డీయే ఎంపీల భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఎన్డీయే కూటమి ఎంపీల భేటీ జరిగింది. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు నూతన ఎంపీలు అందరూ ఆమోదం తెలిపింది. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.

AP Politics: అందుకే పవన్ గెలిచారు.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

AP Politics: అందుకే పవన్ గెలిచారు.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ (Satyakumar) పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు.

AP News: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకంటే..?

AP News: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకంటే..?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈరోజు రాత్రికి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసే అవకాశం ఉంది.

YSRCP: వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు.. నేతల పరేషాన్

YSRCP: వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు.. నేతల పరేషాన్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టా బుట్ట సర్దేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని వదలి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.

BJP: ఢిల్లీలో బీజేపీ నేతల కీలక భేటీ.. మంత్రివర్గంలో ఎవరెవరంటే..?

BJP: ఢిల్లీలో బీజేపీ నేతల కీలక భేటీ.. మంత్రివర్గంలో ఎవరెవరంటే..?

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి