Home » NDA Alliance
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమది ప్రజా ప్రభుత్వమని.. దుర్మార్గపు ప్రభుత్వం కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) వ్యాఖ్యానించారు. దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
సీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు– ప్రభుత్వం ఏర్పాటు– లోనే తడబడ్డారు. దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలు ఆశాజీవులు. మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ, మూడవ అడుగులు– పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ– ఎలా ఉండనున్నాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటుచేసుకోవాలని నేను ఆశిస్తున్నాను; పార్లమెంటులో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాను. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో..
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించిందని, ఇది చిన్న విజయం కాదు.. అద్భుతమైన విజయమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
కేంద్ర మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.
‘మోదీ 3.0’ సర్కారు ఆదివారం కొలుదీరింది. దేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ, 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులు కలుపుకొని మొత్తం 72 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక్కడి వరకు ఓకే.. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్న లోక్సభ స్పీకర్ ఎవరు?.
కేంద్రంలో మోదీ(PM Modi) ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తరుణంలో ప్రతిపక్షాలు ఆయన సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో కొలువుదీరిన సంకీర్ణ సర్కార్.. ఏడాదిలో కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.