Home » NCP
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరో బాంబు పేల్చారు. ఎన్సీపీ పేరు, పార్టీ గుర్తు తమవేనని ప్రకటించుకున్నారు. ఎన్సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికకు వెళ్తామని చెప్పారు.
మహారాష్ట్రలో ఆదివారం రాజకీయంగా అతి పెద్ద సంచలనం నమోదైంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్తోపాటు ఎన్సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.
మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.
శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల తలెత్తిన లుకలుకలన్నీ సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. తనకు అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేత పదవిపై ఆసక్తి లేదని, పార్టీ బాధ్యత అప్పగించమని అధిష్ఠానాన్ని పవార్ మేనల్లుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ కోరారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన నియామకం పట్ల పార్టీ నేత అజిత్ పవార్ సంతృప్తిగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను సుప్రియా సూలే తోసిపుచ్చారు. అవిన్నీ పుకార్లేనని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల విషయంలో ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె సుప్రియా సూలే. సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే అజిత్ పవార్కు నియామకాల్లో చోటు దక్కలేదు. దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు. అజిత్ ఇప్పటికే అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారని, పార్టీ డెసిషన్ మేకర్స్లో అజిత్ కూడా ఉన్నారని చెప్పారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే , ప్రఫుల్ పటేల్ ను ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ శనివారంనాడు ప్రకటించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవార్ ఈ నియామకాలు చేశారు. పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్సీపీని స్థాపించారు.
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభమవడం పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్
ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు