Home » Nara Chandra Babu Naidu
తెలుగుదేశం కంచుకోట గన్నవరంలో వైసీపీ సైకోల ఆటలు ఇక సాగవని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ (వైసీపీ) తిరిగితే ప్రజల మెడకు ఉరేనని అన్నారు. రేపు సాయంత్రం 4గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా రోడ్ల పైకి వచ్చి జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాల నకళ్లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు.
ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే గన్నవరంలో కూడా భారీ వర్షం పడుతుండటం.. ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభ కూడా జరుగుతోంది.
రాష్ట్రాన్ని అపహస్యం చేసి.. గంజాయి మయంగా చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవుతుందని ఉద్ఘాటించారు.
ఉత్తరాంధ్రాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడనే స్ధాయా బొత్సది? కాదని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. ప్రపంచంలోనే లీడర్షిప్ లోటు ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ లీడర్గా ఎదిగారని చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి ఉందని తెలిపారు.
సీఎం జగన్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతుండటంతో పలువురి మద్దతు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి లభిస్తోంది. అన్నిమతాలు, కులాల వారి నుంచి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) అపూర్వ ఆదరణ వస్తోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పలు సంస్థలు టీడీపీతో కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగానే యూపీలోని దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.