Home » Nara Chandra Babu Naidu
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.
హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు.
తాను అధికార దర్పాన్ని అనుభవించడానికి, ప్రతిపక్ష నేతలపై పగ సాధించడానికే జగన్మోహన్రెడ్డికి పదవి దక్కినట్లయింది!
ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.
మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. మంగళవారం డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు.
వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ బూత్లో పోలిం గ్ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు.