• Home » Nampalli

Nampalli

Phone Tapping Case: బెయిల్‌ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా

Phone Tapping Case: బెయిల్‌ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రువారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

Hyderabad:శివబాలకృష్ణ బెయిల్.. ఆ పొరపాటు వలనే..

Hyderabad:శివబాలకృష్ణ బెయిల్.. ఆ పొరపాటు వలనే..

రెరా మాజీ కార్యదర్శి శివ బాలక‌ష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయ్యారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయక పోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

TS News: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్

TS News: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నేటితో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఈరోజు (మంగళవారం) ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను కాసేపట్లో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

తన కుటుంబ సభ్యులకు సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ దస్తగిరి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌ని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

TS NEWS: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

TS NEWS: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటీషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో కీలక తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్‌ గౌడ్‌పై దాఖలైన పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది.

 Bengaluru-Hyderabad: జస్ట్ రూ. 100 లతో పోలీసులకు చుక్కలు చూపించిన 12 ఏళ్ల పిల్లాడు..!

Bengaluru-Hyderabad: జస్ట్ రూ. 100 లతో పోలీసులకు చుక్కలు చూపించిన 12 ఏళ్ల పిల్లాడు..!

Bengaluru-Hyderabad: ఆదివారం బెంగళూరు నుండి తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు వెతికినా సాధ్యం కాని అతని ఆచూకీని సోషల్ మీడియా కనిపెట్టేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న 100 రూపాయలతో బెంగళూరు నుంచి బయలుదేరి.. 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

Nampally Court: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. హైదరాబాద్‌లో తొలిసారి ఉరిశిక్ష

Nampally Court: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. హైదరాబాద్‌లో తొలిసారి ఉరిశిక్ష

హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో కట్నం కోసం భార్యను అతి దారుణంగా హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్‌ చరిత్రలో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. ఆ వివరాల్లోకి వెళ్తే.. భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఇమ్రాన్ ఉల్ హక్‌కు ఒక మహిళతో వివాహం అయ్యింది.

Charminar Express: నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు

Charminar Express: నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు

Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కేసు నమోదు అయ్యింది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మొత్తం మూడు బోగీలు అనగా ఎస్‌ 1, ఎస్‌ 2, ఎస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి.

Charminar Express: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై  మంత్రి పొన్నం విచారం

Charminar Express: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం

Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సైడ్ వాల్‌ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు.

CM Revanth Reddy: గిగ్ వర్కర్లతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

CM Revanth Reddy: గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, ఓలా, ఉబర్‌, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) సమావేశం అయ్యారు. గిగ్‌ వర్కర్ల (Gig workers) సమస్యలపై చర్చించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ ( Nampally Exhibition Ground ) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కాసేపటి క్రితమే వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి