Home » Nampalli
నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Hyderabad: నగరంలోని నాపంల్లి బజార్ఘాట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ డీజీపీ నాగిరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బజార్ఘాట్ అగ్ని ప్రమాదంలో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.
నాంపల్లి కోర్టు(Nampally Court)లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్(Mohammed Salimuddin) అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా గన్పార్క్ దగ్గర అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు.
హైదరాబాద్: యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కాలేజీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గన్పార్క్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుని.. ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో సంచలనం రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టు హాజరుపర్చారు.
నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయేందుకు సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి (Patolla Govardhan Reddy) హత్య కేసు (Murder Case)లో శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampalli Court) తీర్పు ఇచ్చింది.
టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.