• Home » Nampalli

Nampalli

ACB: ఏసీపీ కస్టడీ కోరుతూ  కోర్టులో ఏసీబీ పిటిషన్.. నేడు విచారణ..

ACB: ఏసీపీ కస్టడీ కోరుతూ కోర్టులో ఏసీబీ పిటిషన్.. నేడు విచారణ..

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అరస్టయి, రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేయనుంది.

Viveka Case: వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా

Viveka Case: వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా

Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.

Nampalli Court: ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌..

Nampalli Court: ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌, ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్‌ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్‌ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

TS News: అమిత్‌ షా ఫేక్ వీడియో కేసు... నిందితులకు బెయిల్ మంజూరు

TS News: అమిత్‌ షా ఫేక్ వీడియో కేసు... నిందితులకు బెయిల్ మంజూరు

Telangana: కేంద్రహోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈకేసులో TPCC సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది.

Phone Tapping Case: బెయిల్‌ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా

Phone Tapping Case: బెయిల్‌ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రువారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

Hyderabad:శివబాలకృష్ణ బెయిల్.. ఆ పొరపాటు వలనే..

Hyderabad:శివబాలకృష్ణ బెయిల్.. ఆ పొరపాటు వలనే..

రెరా మాజీ కార్యదర్శి శివ బాలక‌ష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయ్యారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయక పోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

TS News: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్

TS News: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నేటితో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఈరోజు (మంగళవారం) ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను కాసేపట్లో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

తన కుటుంబ సభ్యులకు సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ దస్తగిరి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌ని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

TS NEWS: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

TS NEWS: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటీషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో కీలక తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్‌ గౌడ్‌పై దాఖలైన పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది.

 Bengaluru-Hyderabad: జస్ట్ రూ. 100 లతో పోలీసులకు చుక్కలు చూపించిన 12 ఏళ్ల పిల్లాడు..!

Bengaluru-Hyderabad: జస్ట్ రూ. 100 లతో పోలీసులకు చుక్కలు చూపించిన 12 ఏళ్ల పిల్లాడు..!

Bengaluru-Hyderabad: ఆదివారం బెంగళూరు నుండి తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు వెతికినా సాధ్యం కాని అతని ఆచూకీని సోషల్ మీడియా కనిపెట్టేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న 100 రూపాయలతో బెంగళూరు నుంచి బయలుదేరి.. 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి