Home » Mulugu
Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.
Telangana: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు.
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.
Telangana: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు.
మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్నారు.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ములుగు: మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మహాజాతరలో ఈరోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారంకు పోటెత్తారు. భక్తకోటి మూట, ముల్లే కట్టుకుని మేడారం వైపు అడుగులు వేస్తున్నారు.
Telangana: పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అని మంత్రి సీతక్క అన్నారు. గతంలో కాలినడకన వచ్చేవారని... ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఈరోజు ఉదయం మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.