Home » Mudragada Padmanabham
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్ను పద్మనాభం ప్రశ్నించారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచాలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ప్రచారం చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాను, తన కుమారుడు వైసీపీలో చేరామని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. నేడు కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం పిల్లల పరీక్షల దృష్ట్యా ర్యాలీ నిర్వహించినప్పుడు ధ్వనులు ఇబ్బంది కలిగిస్తుందని నిర్ణయం మార్చుకున్నానని ముద్రగడ అన్నారు.
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించేశారు. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో..
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. వైసీపీ లో చేరుతున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్ను సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించు కున్నట్లు వెల్లడించారు.
Andhrapradesh: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు - పవన్లు నిలబడ్డారని అన్నారు.
Pawan Kalyan: ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్లతో ఏపీ రాజకీయం (AP Politics) ఇంట్రస్టింగ్గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు.