Home » Mohan Bhagath
ముంబైలో తాజాగా నిర్వహించిన విహార్ సేవక్ ఉర్జా మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ధర్మం గురించి ఉపన్యసించారు. భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలని, మన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి చాలా అవసరం అని పేర్కొన్నారు.
ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎ్సఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పిలుపిచ్చారు.
జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలే తప్ప ‘రాజకీయాంశం’ ఎంతమాత్రం కాకూడదని హితవు పలికింది.
భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థే సమైక్యంగా ఉంచుతోందని ఆర్ఎ్సఎ్సకు చెందిన ‘పాంచజన్య’ పత్రిక పేర్కొంది. మొగల్ పాలకులు దీనిని అర్థం చేసుకోలేదని.. బ్రిటిషర్లు మాత్రం కనిపెట్టి ‘విభజించి-పాలించు’ విధానంలో దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని తెలిపింది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) అనుకున్నమేర ప్రభావం చూపకపోవడంతో ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయని వదంతులు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) ఆదివారం స్పష్టతనిచ్చారు.