Home » Modi Cabinet
మరికొద్ది సేపట్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సర్కారు కొలువుతీరబోతోంది. దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 50 మంది వరకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోదీ కేబినెట్లో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, ఆశావహులకు చోటుదక్కలేదని తెలుస్తోంది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.
అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రిగా..
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నేడు (జూన్ 9న) దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరీ దృష్టి కూడా మంత్రివర్గంపై(Cabinet) పడింది. ఎవరికీ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎవరు మోదీ 3.0 క్యాబినెట్(Modi 3.0 Cabinet)లో చోటు దక్కించుకోనున్నారనే ఆసక్తి మొదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Narendra Modi Swearing as PM: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మోదీ 3.0’ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..