Home » MLC Kavitha
ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి నిర్వహించే లీడర్షిప్ శిక్షణ కార్యక్రమం ఈ నెల 26న కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభం కానుంది. యువత, మహిళలను నాయకత్వం దిశగా ప్రోత్సహించడమే ఈ శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశం.
కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ , మండలిలో ఆమోదించి ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్ర ప్రభుత్వం పంపలేదని చెప్పుకొచ్చారు.
రేవంత్ సర్కారుపై మరోసారి ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఈసారి సమాచార హక్కు చట్టంలో కమిషనర్ల నియామకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమాచార హక్కు చట్టం కమిషన్ నియామకాల్లో సామాజిక న్యాయం ఎక్కడుందని ఎక్స్ వేదికగా విమర్శించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని.. వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరమ్ గురవారెడ్డి సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేశారు.
కొంత కాలంగా బీఆర్ఎస్ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఒక్క సారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
Telangana HCA Scam: హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపిస్తూ సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరితో పాటు మరికొంత మందిపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.
Kavitha:బీఆర్ఎస్ పార్టిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అలాగే తనపై మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకిచ్చారు
MLC Kavitha: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకుండా ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో.. రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడము అంతే ముఖ్యమన్నారు.
ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.