Home » MLC Kavitha
చాలా కాలం తర్వాత నిజామాబాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలు తిహార్ జైలులో ఉన్న అనంతరం మొదటి సారి జిల్లాకు వస్తున్నారు. డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘనస్వా గతం పలుకుతారు. బై పాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ తమకు పట్టలేదన్నారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా? అని నిలదీశారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి కోసం కాకుండా.. కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.
రుణమాఫీపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చి మరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం సాధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారని.. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని కవిత ప్రశ్నించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ బొమ్మతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు తెచ్చారని కవిత ప్రశ్నించారు.
తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.
ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని తెలిపారు. ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని వాణిదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏదని కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో పర్యటిస్తానని బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉంటానని అధైర్యపడవద్దని కవిత చెప్పారు.