Home » MLC Elections
CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలని... ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని.. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇరువురు నాయకులు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి, నిబద్ధతతో వ్యవహరించారని యూటీఎఫ్, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, సిహెచ్ అనిల్ కుమార్, ఎ వెంకట్, ఎన్ తిరుపతి పాల్గొన్నారు.
Nara Lokesh:సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం ఏడు నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు.
ఫిబ్రవరి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అని, ఫిబ్రవరి 11న స్ర్కూటినీ జరుగుతుందని, 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో మెుత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు.
టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైనా నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్కు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి.
నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి ఈసారి టికెట్ దక్కట్లేదా? ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ, మరో అభ్యర్థిని నిలబెట్టనుందా? ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాలు అవుననే అంటున్నాయి.
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.