• Home » Medigadda Barrage

Medigadda Barrage

 Kaleshwaram: పనులు ఎలా జరుగుతున్నాయి!

Kaleshwaram: పనులు ఎలా జరుగుతున్నాయి!

రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శుక్రవారం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌ సందర్శించనున్నారు.

Kaleshwaram: నేడు రాష్ట్రానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌

Kaleshwaram: నేడు రాష్ట్రానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈనెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది.

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీలను సందర్శించిన నిపుణుల కమిటీ

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీలను సందర్శించిన నిపుణుల కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.

Medigadda Barrage: రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ...

Medigadda Barrage: రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ...

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది.

TG News: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ముమ్మరం చేసిన చంద్రఘోష్‌ కమిటీ

TG News: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ముమ్మరం చేసిన చంద్రఘోష్‌ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ (Chandraghosh) నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్‌ న్యాయవిచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జూన్ 6వ తేదీకి కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర గోష్ హైదరాబాద్ వస్తున్నారు.

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పనులు..

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పనులు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇసుక గ్రౌటింగ్‌ కోసం డ్రిల్లింగ్‌ పనులు నడుస్తుండగా.. దిగువన షీట్‌ పైల్స్‌ అమరిక, సీసీ బ్లాకుల రీ అరెంజ్‌మెంట్‌ పనులు కొనసాగుతున్నాయి.

Kaleshwaram Paroject: ‘మేడిగడ్డ’ ఎగువన అప్రోచ్‌ రోడ్డు విస్తరణ!

Kaleshwaram Paroject: ‘మేడిగడ్డ’ ఎగువన అప్రోచ్‌ రోడ్డు విస్తరణ!

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆర్క్‌ గ్రౌగింగ్‌ పద్ధతిలో 20వ నెంబరు గేటు తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు.

Telangana : గ్రౌటింగ్‌ మరింత ఆలస్యం!

Telangana : గ్రౌటింగ్‌ మరింత ఆలస్యం!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్‌-7 కింద అగాధాన్ని పూడ్చేందుకు గ్రౌటింగ్‌ పనుల ప్రారంభానికి మరోరోజు సమయం పట్టనుంది.

Kaleshwaram: రేపు మేడిగడ్డకు  సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ బృందం

Kaleshwaram: రేపు మేడిగడ్డకు సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా ఉందో గుర్తించేందుకుగాను భూ భౌతిక (జియో ఫిజికల్‌), భూ సాంకేతిక (జియో టెక్నికల్‌) పరీక్షలు చేయడానికి ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం రానుంది.

Kaleshwaram: మేడిగడ్డలో షీట్‌ఫైల్స్‌ పనులు షురూ

Kaleshwaram: మేడిగడ్డలో షీట్‌ఫైల్స్‌ పనులు షురూ

మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్‌-7కు దిగువన షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్‌-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్‌లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను తిరిగి అమరుస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి